యాప్నగరం

బోనమెత్తిన షర్మిల.. చిన్ననాటి స్నేహితురాలితో కలసి మొక్కులు

హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో బారులుదీరారు. వైఎస్ తనయ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించారు.

Samayam Telugu 1 Aug 2021, 7:07 pm
తెలంగాణలో బోనాల ఉత్సావ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పాతబస్తీలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయానికి భక్తుల పోటెత్తారు. ఆడపడుచులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బోనాల ఉత్సవాలకు హాజరయ్యారు. మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామానికి చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు రజిని ఇంటికి వెళ్లిన షర్మిల.. బోనం నెత్తికెత్తుకుని అమ్మవారికి సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగతో పాటు స్నేహితుల దినోత్సవం కావడంతో ఫ్రెండ్ ఇంటికి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఆమె వెంట కొండా రాఘవ రెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు ఉన్నారు.
Samayam Telugu బోనం నెత్తికెత్తుకున్న షర్మిల
sharmila


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.