'సెల్ఫీకి రూ.500.. అయినా సరే..' కేటీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా...
కేటీఆర్తో ఒక్క సెల్ఫీ దిగాలంటే.. రూ. 500 ఖర్చవుద్ది.. అదేంటీ అనుకుంటున్నారా.. సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆరే స్వయంగా ఆ మాట అన్నారు. అలా అన్న తర్వాత అయినా ఆయనతో దిగే సెల్ఫీల సంఖ్య తగ్గిందా అంటే.. లేదనే చెప్పాలి. 500 ఇచ్చి అయినా సరే.. సెల్ఫీ దిగుతామంటూ ముందుకొచ్చారు మహిళలు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్లా జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్.. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
ప్రధానాంశాలు:
- రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
- మహిళలతో మంత్రి కేటీఆర్ సరదా సంభాషణ
- సెల్ఫీకి 500 అవుతుందంటూ చెప్పినా ఫొటోలు దిగిన మహిళలు
"సెల్ఫీకి రూ.500.. ఎందుకంటే అది కేటీఆర్తో.." ఇదేంటీ.. సెల్ఫీ తీసుకుంటే కూడా డబ్బులు ఇవ్వాలా..? కేటీఆర్తో అయినంత మాత్రాన డబ్బులు ఇవాలనుందా..? మనకు నచ్చిన వాళ్లతో అభిమానంతో సెల్ఫీ తీసుకుంటే కూడా డబ్బులు అడుతారా.. హవ్వా... ఇదేం విడ్డూరం... అసలు అలా ఎలా అడుగుతారు..? అని మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ ఒక్కసారే కుమ్మరిస్తూ.. దెప్పిపొడవకండి.. అది ఏదో సరదాగా కేటీఆర్ అన్న మాట. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో కాలినడకన తిరుగుతూ.. అందరిని పలకరిస్తూ వెళ్తున్న క్రమంలో కేటీఆర్తో మహిళలు పెద్ద ఎత్తున సెల్ఫీలు తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఓ మహిళతో సెల్ఫీకి రూ.500 అవుతుంది.. అని సరదాగా అన్నారు. దానికి ఆ మహిళా.. అయినా పర్లేదు అంటూ సెల్ఫీ తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గండిలచ్చపేట గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, సావిత్రీభాయి పూలే విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు తీసుకురావటం కేసీఆర్ లాంటి నాయకుడితోనే సాధ్యమవుతుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిదేండ్లలో అన్ని రకాల కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు నిరంతరం, నిర్విఘ్నంగా సాగాలంటే కేసీఆర్ లాంటి నాయకుడుంటేనే అమలవుతాయన్నారు. దళిత బంధు పథకం కింద ఇద్దరు సోదరులు కలిసి రూ. 25 లక్షలతో ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ ఫామ్ను కేటీఆర్ ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేటలో దళితబంధు పథకం కింద రైస్ మిల్లును ప్రారంభించారు. పదిరె గ్రామంలో 9 మంది కలిసి 90 లక్షలతో పెట్రోల్ బంక్ పెట్టుకున్నారని కలెక్టర్ చెప్పారు. దాన్ని కూడా అంబేద్కర్ జయంతి తర్వాత ప్రారంభించుకుంటామని తెలిపారు. గండిలచ్చపేటలో దళిత బంధు కింద 30 కుటుంబాలు వ్యాపారాలు మొదలు పెట్టాయని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గండిలచ్చపేట గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, సావిత్రీభాయి పూలే విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు తీసుకురావటం కేసీఆర్ లాంటి నాయకుడితోనే సాధ్యమవుతుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిదేండ్లలో అన్ని రకాల కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు నిరంతరం, నిర్విఘ్నంగా సాగాలంటే కేసీఆర్ లాంటి నాయకుడుంటేనే అమలవుతాయన్నారు.
- Read More Telangana News And Telugu News