యాప్నగరం

నిద్రమత్తులో కదులుతున్న రైలు నుంచి కిందపడిన ఏడేళ్ల చిన్నారి

Vijayawada girl slipped from Running Train: నిద్రమత్తులో ఓ చిన్నారి కదులుతున్న రైలు నుంచి కిందపడింది. పెద్దపల్లి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన మౌనిక, తన కుమార్తె లావణ్య (7)తో కలిసి ట్రైన్‌లో బెల్లంపల్లి పట్టణానికి బయలుదేరింది. బెల్లంపల్లిలో ఓ చర్చిలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీరు వెళ్తున్నారు. రైలు ఎక్కిన కాసేపటికే నిద్రపోయిన చిన్నారి లావణ్య.. కాసేపటి తర్వాత వాష్ రూమ్ వెళ్లేందుకు లేచింది. నిద్రమత్తులో నడుచుకుంటూ వెళ్లి వాష్ రూమ్ డోర్ అనుకొని రైలు బోగి ప్రధాన ద్వారం తెరిచింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 29 Sep 2022, 2:51 pm
Samayam Telugu Girl slipped off from Train (Representational Image)
ప్రతీకాత్మక చిత్రం
నిద్రమత్తులో ఏడేళ్ల చిన్నారి కదులుతున్న రైలు నుంచి కిందపడింది. తీవ్ర గాయాల పాలైన బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో (Peddapalli) ఈ సంఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన మౌనిక, తన కుమార్తె లావణ్య (7)ను తీసుకొని ట్రైన్‌లో బెల్లంపల్లికి బయలుదేరింది. బెల్లంపల్లిలో ఓ చర్చిలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీరు వెళ్తున్నారు. అయితే, రైలు ఎక్కిన కాసేపటికే చిన్నారి లావణ్య నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ చిన్నారి వాష్ రూమ్ వెళ్లేందుకు లేచింది. నిద్రమత్తులో నడుచుకుంటూ వెళ్లి వాష్ రూమ్ డోర్ అనుకొని రైలు బోగి ప్రధాన ద్వారం తెరిచి అడుగు వేసింది. అంతే, ఒక్కసారిగా రైలు నుంచి కింద పడిపోయింది.

చిన్నారి లావణ్య కిందపడిపోయిన విషయం గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై చీకురాయి సమీపంలో చైన్ లాగి రైలును నిలిపివేశారు. పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. కానిస్టేబుల్ శరత్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాల పాలైన లావణ్యను అంబులెన్స్‌లో ఎక్కించుకొని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

తీవ్రంగా గాయపడిన బాలిక లావణ్య


ప్రయాణాలు చేసే సందర్భాల్లో చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ డోర్ నుంచి కిందపడే ప్రమాదం ఉంది. నిద్రమత్తులో పొరపాటున ద్వారం నుంచి కిందపడిపోయే ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి.

పామును చంపొద్దని పురోహితుడి తాపత్రయం.. కానీ, విషాదం
Pics: పొలం గట్టుపై కలెక్టర్ దంపతుల భోజనం.. కూలీలతో కలిసి సింపుల్‌గా
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.