యాప్నగరం

ఇద్దరు సీఎంల బండారం బయటపెడతా.. బండి సంజయ్ సంచలన ఆరోపణ

Rajanna Sircilla: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 2015 ఒప్పందం ప్రకారం.. తెలంగాణకి 575 టీఎంసీలు రావాల్సిఉంటే.. ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Samayam Telugu 16 Jul 2021, 6:02 pm
కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్‌ నోరు విప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ డిమాండ్ చేశారు. జల వివాదంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏ ప్రాజెక్టు ఆగబోదని స్పష్టం చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాట గురించి కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ యథేచ్ఛగా నీళ్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతామని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల సీఎంలు కమీషన్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Jagan kcr


రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 2015 ఒప్పందం ప్రకారం.. తెలంగాణకి 575 టీఎంసీలు రావాల్సిఉంటే.. ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని బండి సంజయ్‌ ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు రెండు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంల హైడ్రామా చేస్తున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.