యాప్నగరం

పెద్దపల్లి బసంత్‌నగర్ టోల్‌గేట్‌లో కరోనా కలకలం... 10 సిబ్బందికి పాజిటివ్, అటువైపుగా వెళ్లిన వాహనదారులకు టెన్షన్

పెద్దపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపింది. బసంత్‌నగర్ టోల్‌గేట్‌లో పనిచేస్తున్న 10 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ మార్గంలో వెళ్లిన వాహనదారులు టెన్షన్ పడుతున్నారు.

Samayam Telugu 20 Feb 2021, 10:56 am
తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల నిర్లక్ష్యం కారణంగా ఆ మహమ్మారి మళ్లీ చెలరేగిపోతోంది. కరీంనగర్‌ జిల్లాలో ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 33 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి మరువకముందే పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. జిల్లాలోని బసంత్‌నగర్ టోల్‌గేట్‌లో పనిచేస్తున్న 10 మంది కరోనా బారిన పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu basanth nagar toll plaza 10 workers tests covid 19 positive
పెద్దపల్లి బసంత్‌నగర్ టోల్‌గేట్‌లో కరోనా కలకలం... 10 సిబ్బందికి పాజిటివ్, అటువైపుగా వెళ్లిన వాహనదారులకు టెన్షన్


Also Read: కట్న పిశాచుల్లా మారిన అత్తింటి వారు.. ఆరు నెలలకే ఊహించని షాకిచ్చిన యువతి

బసంత్‌నగర్ టోల్‌గేట్‌లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అనారోగ్యానికి గురికావడంతో కరోనా టెస్టులు చేశారు. వీరిలో 10 మందికి పాజిటివ్ రావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ టోల్‌గేట్ మీదుగా రోజూ వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీంతో కొద్దిరోజులుగా ఈ మార్గంలో వెళ్లిన వాహనదారులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న చాలామంది కరోనా టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: నిజాయితీకి నిలువెత్తు రూపం.. రోడ్డుపై దొరికిన పర్సును మహిళకు తిరిగిచ్చిన హోంగార్డు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.