హుజూరాబాద్: బీజేపీ జెండా గద్దె కూల్చివేత.. సింగపూర్లో ఉద్రిక్తత
Huzurabad By Elections మాజీ మంత్రి ఈటల రాజేంద్ర రాజీనామాతో హుజుారాబాద్ ఉప-ఎన్నిక అనివార్యమయ్యింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Samayam Telugu 6 Aug 2021, 10:24 am
ప్రధానాంశాలు:
- హుజూరాబాద్లో రాజుకున్న ఉప- ఎన్నికల వేడి.
- వారం తర్వాత స్వస్థలానికి చేరుకున్న ఈటల.
- బీజేపీ జెండా గద్దెను కూల్చివేసిన దుండగులు.
హుజురాబాద్లో ఉప ఎన్నిక ముందు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా మరో ఘటన చోటుచేసుంది. ఈ ఘటనతో తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. హుజురాబాద్ మండలం సింగపూర్లో బీజేపీ జెండా గద్దెను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సింగపూర్లో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనను నిరసిస్తూ ‘నేడు ఛలో సింగపైర్’కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు, వారం రోజుల విరామం తర్వాత బీజేపీ నేత ఈటల రాజేందర్ గురువారం హుజూరాబాద్కు చేరుకున్నారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా జులై 30న వీణవంక మండలం కొండపాకలో తీవ్ర అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయనను గురువారం ఉదయం డిశ్చార్జి చేశారు. అక్కడి నుంచి నేరుగా హుజూరాబాద్లోని మధువని గార్డెన్స్కు మధ్యాహ్నం చేరుకున్నారు. ఈటల రాక గురించి తెలుసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని అభిమానులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... తానిప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, హుజూరాబాద్లో రెండ్రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత వైద్యుల సూచన మేరకు త్వరలోనే ఆగిన చోటు నుంచే ప్రజాదీవెన యాత్రను ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయనను గురువారం ఉదయం డిశ్చార్జి చేశారు. అక్కడి నుంచి నేరుగా హుజూరాబాద్లోని మధువని గార్డెన్స్కు మధ్యాహ్నం చేరుకున్నారు. ఈటల రాక గురించి తెలుసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని అభిమానులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... తానిప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, హుజూరాబాద్లో రెండ్రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత వైద్యుల సూచన మేరకు త్వరలోనే ఆగిన చోటు నుంచే ప్రజాదీవెన యాత్రను ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.