Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత పాదయాత్ర రేపు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇప్పుడు యాత్రపై ఉత్కంఠ నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా ఈ పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు అటు నిర్మల్ పోలీసులు ససేమిరా అంటున్నారు. మరోవైపు బండి సంజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు భైంసాకు వెళ్లి తీరుతా అని శపథం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ నుంచి భైంసా వెళ్తుండగా.. బండి సంజయ్ను కోరుట్ల సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్.. వాగ్వాదానికి దిగారు. మరోవైపు కార్యకర్తలు సైతం ఆందోళన చేయటంతో.. కోరుట్ల వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. బండి సంజయ్ను బలవతంగా.. కరీంనగర్లోని ఆయన ఇంటికి తరలించారు. మరోవైపు.. భైంసాకు వెళ్లకుండా అడ్డుకోవటంపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "రేపు ఎట్టి పరిస్థితుల్లో భైంసాకు వెళ్లి తీరుతా. న్యాయస్థానం తలుపు తడతాం. పాదయాత్రకు ముందు అనుమతిచ్చారు. ఇప్పుడు సడెన్గా ఎందుకు రద్దు చేశారు..? రేపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా వస్తున్నారు. రూట్ మ్యాప్ ప్రకటించాక ఇలా చేస్తారా..? భైంసా సున్నితమైన ప్రాంతం అంటున్నారు. అదేమైనా నిషేధిత ప్రాంతమా..? వెళ్లకూడదా..? బైంసాని కాపాడలేని సీఎం కేసీఆర్ ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు..? సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకోటి కావాలా..? ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే అడ్డుకుంటారా..?" అంటూ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు కరీంనగర్ వెళ్తున్నానన్న బండి సంజయ్.. తమకు రేపు మధ్యాహ్నం వరకు సమయం ఉందన్నారు. అప్పటి వరకు అనుమతి కోసం వేచి చూస్తామని పేర్కొన్నారు. ఇదే విషయమై రేపు బండి సంజయ్ హైకోర్టుకు వెళ్లనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. అటు నిర్మల్లో బీజేపీ శ్రేణులు పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగటంతో.. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే నిర్మల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు ఈ పాదయాత్ర సాగుతుందా.. ఆగుతుందా.. ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనే అంశం ఉత్కంఠ రేపుతోంది.
ఇదిలా ఉంటే.. అటు నిర్మల్లో బీజేపీ శ్రేణులు పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగటంతో.. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే నిర్మల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు ఈ పాదయాత్ర సాగుతుందా.. ఆగుతుందా.. ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనే అంశం ఉత్కంఠ రేపుతోంది.
- Read More Telangana News and Telugu News