యాప్నగరం

Rajanna Siricilla: ప్రధానే నా గురించి మాట్లాడటం ఊహించని భాగ్యం.. సిరిసిల్ల నేతన్న ఉద్వేగం

Rajanna Siricilla: దేశ ప్రధానే తన గురించి మాట్లాడటంపై సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ ఉధ్వేగభరితుడయ్యాడు. దేశమంతా వినే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. పదే పదే తన పేరును ప్రస్తావించటం.. తాను నేసిన వస్త్రాన్ని ప్రదర్శించటంపై హర్షం వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో కలిసి చూస్తూ.. ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కాగా.. కరీంనగర్‌లో ఉన్న బండి సంజయ్ హరిప్రసాద్‌ను కలుసుకున్నారు. ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న హరిప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 27 Nov 2022, 10:34 pm

ప్రధానాంశాలు:

  • ప్రధాని తన గురించి మాట్లాడటంపై ఉద్వేగానికి లోనైన హరిప్రసాద్
  • మోదీ స్పూర్తితో కళను పది మందికి నేర్పిస్తానన్న సిరిసిల్న నేతన్న
  • హరి ప్రసాద్‌ను ఘనంగా సన్మానించిన బండి సంజయ్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Rajanna Siricilla: ‘మన్ కీ బాత్ (Mann ki Baat)’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన గురించి మాట్లాడటం పట్ల సిరిసిల్ల (Siricilla) చేనేత కార్మికుడు హరిప్రసాద్ (Hari prasad) ఉద్వేగానికి లోనయ్యారు. తన చేతితో స్వయంగా నేసిన జీ-20 లోగో ఉన్న వస్త్రాన్ని చూపిస్తూ.. తన పేరును పదేపదే ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉందని హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఊహించని భాగ్యం దక్కిందంటూ.. ఉద్వేగభరితుడయ్యాడు. టీవీలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూస్తూ హరిప్రసాద్‌తో పాటు అతని కుటుంబసభ్యులు ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఆడెపు రవీందర్‌తో కలిసి కరీంనగర్‌కు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌.. హరిప్రసాద్‌ను తన దగ్గరికి పిలిపించుకున్నారు. హరిప్రసాద్‌తో బండి సంజయ్ కాసేపు ముచ్చటించారు. హరిప్రసాద్ యోగక్షేమాలు, కుటుంబం గురించి, చేస్తున్న పనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ ప్రశంసలందుకున్న హరిప్రసాద్‌ను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు.

ప్రధాని మోదీ స్పూర్తితో.. కనుమరుగవుతున్న చేనేత కళను పది మందికి విస్తరించాలనే కోరిక ఉందని హరిప్రసాద్ చెప్పటంతో.. వెంటనే స్పందించిన బండి సంజయ్.. "శెభాష్.. 10 మందికి చేనేత కళను అందించేందుకు పూనుకోవడం చాలా గొప్ప విషయం. అందుకు అవసరమైన సహాయ సహకారాలు, ఆర్థిక సాయం నేను అందజేస్తా.." అని బండి సంజయ్ హామీ ఇచ్చారు. తనకు భరోసా ఇచ్చిన బండి సంజయ్‌కు, సహకరించిన ఆడెపు రవీందర్‌కు హరి ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.