యాప్నగరం

బావిలోపడ్డ కారు .. ముగ్గురు గల్లంతు

బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కారులో ముగ్గురు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Samayam Telugu 29 Jul 2021, 1:09 pm
వ్యవసాయ బావిలో ఓ కారు గల్లంతయ్యింది. దీంతో ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ గ్రామంలో కొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారి పౌల్ట్రీ ఫారం ఎదురుగా ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న వ్యక్తులు గల్లంతు అయ్యారు.
Samayam Telugu బావిలో పడ్డ కారు


సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చల్లా మధూకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వ్యవసాయ బావిలో పడిన కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.