యాప్నగరం

ఈటల రాజేందర్ చిన్నోడు.. అయ్యేది లేదు.. సచ్చేది లేదు.. KCR సంచలనం

Huzurabad News: దళిత బంధు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనుగుల మండలం ఎంపీటీసీ సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఈటలపై వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 24 Jul 2021, 6:18 pm
బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ గురించి కేసీఆర్ మాట్లాడిన ఓ వ్యాఖ్య నెట్టింట్లో వైరల్ అవుతోంది. దళిత బంధు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనుగుల మండలం ఎంపీటీసీ సభ్యురాలి భర్తకు ఫోన్ చేసిన సందర్భంలో ఈటల గురించి కేసీఆర్ మాట్లాడారు. ‘‘ఈటల రాజేందర్ చిన్నోడు’’ అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ‘‘ఈటల రాజేందర్‌తో (వానితో) అయ్యేది లేదు.. సచ్చేది లేదు.. అది ఇడిసిపెట్టుండి’’ ఆయన తనదైన శైలిలో తీసిపారేశారు. ఈటల రాజేందర్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అవతలి వ్యక్తితో అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr etala rajender


దళిత బంధు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనుగుల మండలం ఎంపీటీసీ సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. తాను 2001 నుంచి టీఆర్ఎస్‌కు మద్దతుగా పనిచేస్తున్నానని కేసీఆర్‌తో అన్నారు. ఈటల రాజేందర్‌ వెంట ఉన్నప్పుడు కూడా ఆయన తనను దూరం పెట్టేవారని చెప్పుకొచ్చారు. చాలాసార్లు మనస్తాపానికి గురయ్యానని సీఎంతో అన్నారు. దీనిపై స్పందించిన సీఎం ‘‘ఈటల రాజేందర్‌తో అయ్యేది కాదు.. పోయేది కాదంటూ’’ ఆయన తనదైన శైలిలో తేలికైన వ్యాఖ్యలు చేశారు.

దళిత బంధు మంచి పథకమని, హుజూరాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రమంతా దళితులు బాగుపడతారని సీఎం కేసీఆర్ అన్నారు. తాను తలచుకుంటే వందకు వంద శాతం దళితులకు మేలు జరుగుతుందని కేసీఆర్ రామస్వామికి హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.