వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈటల రాజేందర్ అక్రమార్జనపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్చార్జి కౌశిక్ రెడ్డి. హాస్టల్లో ఉన్నా.. దొడ్డుబియ్యం తిని పెరిగానని చెప్పే మంత్రి ఈటలకి.. రెండొందల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. వంద కోట్ల రూపాయలతో పెద్ద గడీ నిర్మించుకున్నారని.. కానీ నియోజకవర్గంలో పేదలకు ఇల్లు కట్టడం లేదని ఆయన ఆయన ఆరోపించారు. బీసీ ముసుగులో ఉన్న దొర ఈటల అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈటలను జైలుకి పంపిస్తామని ఆయన హెచ్చరించారు. మంత్రి అక్రమార్జనపై తన వద్ద ఆధారాలున్నాయంటూ బాంబు పేల్చిన కౌశిక్ రెడ్డి.. బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తానంటూ సవాల్ విసిరారు. Also Read:
200 ఎకరాలు.. వంద కోట్ల గడీ.. ఈటలపై సంచలన ఆరోపణలు
మంత్రి ఈటల రాజేందర్పై కాంగ్రెస్ పార్టీ నేత సంచలన ఆరోపణలు చేశారు. హాస్టల్లో చదువుకున్నానని చెప్పుకునే ఈటలకి రెండొందల ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు.
Samayam Telugu 22 Mar 2021, 6:51 pm
ప్రధానాంశాలు:
- ఈటల అక్రమార్జనపై ఆరోపణలు
- ఆధారాలున్నాయని బాంబు పేల్చిన కాంగ్రెస్ నేత
- బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తానని సవాల్