యాప్నగరం

వేగంగా దూసుకొచ్చిన లారీ.. గాల్లో కలిసిన దంపతుల ప్రాణాలు, మంచిర్యాలలో విషాదం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డుప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించి డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 18 Jan 2021, 7:16 pm
రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డుప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. రహదారిపై ఎంత జాగ్రత్తగా వెళ్తున్న ఎదుటివారి నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. వాహనాలు అజాగ్రత్తగా నడపడం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో సంభవిస్తున్న రోడ్డుప్రమాదాలు ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. తాజాగా సోమవారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ హోమ్‌ ఫీల్డ్‌ పరిశ్రమ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ లారీ దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu Image


స్థానికులు ఇచ్చిన సమాచారంతో డీసీపీ ఉదయ్‌ కుమార్‌, సీఐ వినోద్‌ తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ అతి వేగంగా లారీని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.