యాప్నగరం

ఈటల యాత్రకు బ్రేక్.. నడవలేని స్థితిలో.. హైదరాబాద్‌కి తరలింపు?

బీజేపీ నేత ఈటల రాజేందర్ యాత్ర నిలిచిపోయింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయని.. వెంటనే హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

Samayam Telugu 30 Jul 2021, 9:04 pm
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజా దీవెన యాత్రకు బ్రేక్ పడింది. ఈటల అనారోగ్యానికి గురవడంతో యాత్రకి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ నెల 19 వ తేదీన ఈటల ప్రజాదీవెన యాత్ర చేపట్టారు. పదకొండు రోజుల పాటు సాగిన యాత్రలో 70 గ్రామాలను కలుపుకుంటూ 220 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పన్నెండో రోజు యాత్ర వీణవంక మండలం కొండపాక చేరుకోగా ఈటల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
etela


కనీసం నడవలేదని స్థితిలో యాత్రను కొండపాకలోనే నిలిపివేశారు. వైద్యులు బీపీ, షుగర్ లెవెల్స్‌ను పరీక్షించారు. ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోయిందని.. హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. వైద్యుల సూచనలతో ఈటలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫోన్ చేసి పరామర్శించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.