యాప్నగరం

నా హత్యకు ఓ మంత్రి కుట్ర... ఈటల సంచలన వ్యాఖ్యలు

తన హత్యకు సంబంధించి కుట్ర జరుగుతున్నట్లు తనకు పక్కా సమాచారం ఉందన్నారు ఈటల రాజేందర్. జిల్లాకు చెందిన ఓ మంత్రి హంతకుల ముఠాను సంప్రదించినట్లు తనకు తెలిసిందన్నారు.

Samayam Telugu 20 Jul 2021, 8:20 am
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు ఓ మంత్రి కుట్ర చేస్తున్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌కు చెందిన మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు . ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం తనకు వచ్చిందని వెల్లడించాడు . పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా ఈటల చేసిన ప్రసంగం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. అంతేకాకుండా తాను ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, తాను పాదయాత్ర కోసం అనుమతి తీసుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు చట్టంపై నమ్మకముందని పోలీసులకు సహకరించాలని కోరారు.
Samayam Telugu ఈటల రాజేందర్


కెసిఆర్ రజాకార్ల రాజ్యం చేశారంటూ మండిపడ్డారు. దళిత బందు ప్రవేశ పెట్టినందుకు సంతోషమన్నారు. దళితుల సంక్షేమ కోసం ప్రభుత్వం ఏం చేయలేదని విమర్శించారు. ఎన్నికల కోసం పథకాలు తీసుకు రావద్దన్నారు. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను ప్రజల మధ్యకు తీసుకువచ్చినది మనమే అన్నారు. అన్నం పెట్టుకోడానికి తెచ్చుకున్న సామానులు కూడా తాళం వేశారు, ఇదేం సంస్కృతి అంటూ ఈటల మండిపడ్డారు.

తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు ఈటల. హంతక ముఠాతో చేతులు కలిపారని తనకు సమాచారం వచ్చిందన్నారు. ‘అరె కొడకల్లారా! నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు. ఈ చిల్లర ప్రయత్నాలకు ఈనాడు కూడా భయపడం’ అంటూ ఈటల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక లో ఎం జరిగిందో అదే హుజూరాబాద్‌లో కూడా జరుగుతుందని జోస్యం చెప్పారు ఈటల.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.