యాప్నగరం

పార్టీ గుర్తు అదే మనుషులు మారుతారేమో... పోటీపై ఈటల సతీమణి కీలక వ్యాఖ్యలు

ఈటల సతీమణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. ఆమె చేసిన కామెంట్స్‌తో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల పోటీకి దిగుతారా లేదా ? అన్న ప్రశ్నలు తలెత్తాయి.

Samayam Telugu 18 Jul 2021, 1:05 pm
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ అన్ని పార్టీలు మాత్రం ఇప్పటికే హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టాయి. బీజేపీలో ఈటల రాజేందర్ చేరికతో ఆయన బీజేపీ తరపున హుజూరాబాద్‌లో పోటికి సిద్ధమవుతున్నారు. దీంతో ఈటలతో పాటుఆయన సతీమణి, అనుచరులు , అభిమానులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రచారంలో ఉన్న ఈటెల సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ఈటల జమున రెడ్డి


‘పోటీలో నేను ఉన్నా ఈటెల రాజేందర్ ఉన్నా ఒకటే’ అన్నారు ఈటల జమునా రెడ్డి. ఈటల తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఆయన వెంట ఉండి ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు.
కాబట్టి ఎవరికీ ఛాన్స్ వస్తే వాళ్ళం పోటీలో ఉంటామన్నారు. పార్టీ గుర్తు ఒక్కటే ఉంటుంది.. మనుషులు మాత్రం మారుతారేమోనంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని బుడగజంగాల కాలనీ కాకతీయకాలనీలో ప్రచారం సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.