యాప్నగరం

కరెక్ట్ టైంలో నా ప్లాన్ ఏంటో చెప్తా.. ఈటల రాజేందర్ వెల్లడి

Huzurabad: ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయ్యిందని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం చెబుతానని అన్నారు. తన పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.

Samayam Telugu 5 May 2021, 3:23 pm
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్తు కార్యాచారణ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల రాజేందర్ చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచరులతో, జిల్లా నేతలతో చర్చించానని, ఉద్యమకారులతో కూడా మాట్లాడానని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలకంటే కరోనా పరిస్థితులపై ఎక్కువగా ఆలోచించాలని అన్నారు. బుధవారం ఈటల హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
eatela rajender


ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయ్యిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం చెబుతానని అన్నారు. తన పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. సమస్య వస్తే మీ దగ్గరికే వస్తానని ఈటల వెల్లడించారు.

సోమవారం రోజు హైదరాబాద్ నుంచి మంత్రి ఈటల తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాసాయిపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారని ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై సానుభూతి పెద్ద ఎత్తున పెరిగిపోయింది. మరోవైపు దేవర యంజాల్‌లో ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులు భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారనే విషయంపై ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ జరుపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.