యాప్నగరం

ఈటల రాజేందర్ మా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు.. దివ్యాంగుడి సంచలనం

హుజూరాబాద్ ఎన్నికల రణరంగంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాజేందర్‌కి ఓటు వేయొద్దని.. తన కుటుంబాన్ని సర్వనాశనం చేశాడంటూ దివ్యాంగుడు ప్లకార్డులతో ప్రచారం చేయడం కలకలం రేపుతోంది.

Samayam Telugu 24 Oct 2021, 10:54 pm
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కేసీఆర్‌ అహంకారానికి.. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి పోటీ అంటూ ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి ఓ దివ్యాంగుడు షాకిచ్చాడు. ఈటల రాజేందర్‌కి ఓటేయొద్దంటూ ప్రచారం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈటల రాజేందర్ తన కుటుంబాన్ని సర్వనాశనం చేశాడని.. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాడంటూ ప్లకార్డు చేతబూని నిరసన తెలపడం సంచలనం రేపుతోంది. ఈటల రాజేందర్‌కి ఒక్క ఓటు కూడా వేయొద్దంటూ హుజూరాబాద్ మండలానికి చెందిన దివ్యాంగుడు ఆడెపు రమేష్ ప్రచారం చేస్తున్నాడు. మీ కాళ్లు మొక్కుతా.. ఈటలకి ఓటు వేయొద్దని రమేష్ అభ్యర్థిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే రమేష్‌కి జరిగిన అన్యాయం ఏంటి? ఎందుకు ఓటేయొద్దని ప్రచారం చేస్తున్నాడనే వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మ చిత్రం
etela


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.