యాప్నగరం

డెలివరీ కాకుండానే శిశువును అందించిన సిబ్బంది.. షాక్ తిన్న గర్భిణి

స్థానిక ఏరియా ఆస్పత్రిలో అప్పుడు ఓ శిశువు జన్మించింది. అయితే ఆ బిడ్డను తల్లికి కాకుండా.. మరో మహిళకు అప్పగించారు. అయితే పాపను అప్పగించిన మహిళకు ఇంకా డెలివరీయే కాకపోవడంతో.. ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

Samayam Telugu 30 Mar 2021, 10:32 am
ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం మరోసారి బయటిపడింది. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ స్థానిక ఏరియా ఆస్పత్రిలో అప్పుడే జన్మించిన శిశువును తల్లికి కాకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో మహిళకు అప్పగించారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్‌ గ్రామానికి చెందిన రజిత ప్రసవం కోసం హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో చేరింది.
Samayam Telugu ఒకరి బిడ్డ మరొకరికి


ఆడశిశువుకు జన్మనివ్వగా కింది స్థాయి సిబ్బంది రచన అనే మహిళ కుటుంబ సభ్యులకు అందజేశారు. కానీ రచనకు ఇంకా ఆపరేషన్‌ జరగలేదు. ఆపరేషన్‌ అనంతరం రజిత వద్ద పాప లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే వైద్యసిబ్బంది అప్రమత్తమై రచన కుటుంబ సభ్యుల వద్ద నుంచి పాపను తీసుకొచ్చి రజిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాప మరొకరికి ఎలా ఎలా అప్పగిస్తారంటూ రజిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రజిత కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌ మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. శిశువును తిరిగి తల్లికి అప్పగించామని తెలిపారు.అయితే సిబ్బంది నిర్లక్ష్యం పట్ల రోగులు వారి బంధువులు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.