యాప్నగరం

'మంత్రి కొప్పుల ఈశ్వర్ భక్తులకు క్షమాపణ చెప్పాలి'.. ఏం జరిగిందంటే !

Koppula eshwar: భక్తుల మనోభావాలు దెబ్బతీసిన సంక్షేమ శాఖ మంత్రి కప్పుల ఈశ్వర్ క్షమాపణలు చెప్పాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఆగమ శాస్త్రం ప్రకారం వేకువజూమునే తెరవాల్సిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి కారణంగా ఆలస్యంగా తెరిచారని ఆయన ఆరోపించారు. మంత్రి 45 నిమషాలు లేట్‌గా ఆలయానికి రావటంతో ఉత్తర ద్వారాన్ని ఆలస్యంగా తెరిచారని లక్ష్మణ్ ఆరోపించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 2 Jan 2023, 1:44 pm
Samayam Telugu Koppula eshwar
కొప్పుల ఈశ్వర్
Koppula eshwar: తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భక్తులకు క్షమాపణలు చెప్పాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున ఉత్తర ద్వారం తెరవాల్సి ఉండగా.. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆలస్యంగా ఆలయానికి రావడంతో 45 నిమిషాలు ఆలస్యంగా ఉత్తర ద్వారం తెరిచారని ఆయన ఆరోపించారు.

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరవాల్సి ఉందని అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కారణంగా సమయానికి ఉత్తర ద్వారం తెరవకుండా ఆలస్యం చేశారని ఆయన మండిపడ్డారు. ఆలస్యంగా ఆలయానికి వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీశారనన్నారు. అందుకు మంత్రి క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి సహా.. భద్రచలం, కొమురవెల్లి, వేములవాడ తదితర అన్ని ప్రముఖ ఆలయాలు పోటెత్తాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.