యాప్నగరం

జగిత్యాలలో ఆమె, దుబాయ్‌లో అతడు.. ఉరేసుకున్న జంట, తల్లికి సెల్ఫీ వీడియో

Jagityal: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లికి చెందిన లింగంపల్లి మనీషా అనే యువతి, అదే జిల్లా లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన రాకేశ్ కొన్నేళ్లుగా‌ ప్రేమించుకుంటున్నారు.

Samayam Telugu 23 Jan 2021, 10:47 pm
గాఢమైన ప్రేమ వ్యవహారం యువజంటను బలిగొంది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించబోరనే భావనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఇది తట్టుకోలేని ప్రియుడు తాను కూడా తనువు చాలించాడు. ఈ సమయంలో అతను దుబాయ్‌లో ఉండడం గమనార్హం. అతను అక్కడి నుంచి తన తల్లితో విషయం చెప్పి వీడియో కాల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
Samayam Telugu ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు
jagityal lovers suicide


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లికి చెందిన లింగంపల్లి మనీషా అనే యువతి, అదే జిల్లా లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన రాకేశ్ కొన్నేళ్లుగా‌ ప్రేమించుకుంటున్నారు. సంవత్సరం క్రితం రాకేశ్‌ ఉద్యోగం కోసం దుబాయ్‌ వెళ్లాడు. మరోవైపు, మనీషాకు తన ఇంట్లో ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పకపోవడంతో ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేక పోయిన మనీషా రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయం దుబాయ్‌లోని రాకేశ్‌కు తెలిసింది. వెంటనే ఓ సెల్ఫీ వీడియో ద్వారా తల్లికి తన బాధను చెబుతూ మనీషా లేకుండా తాను బతకలేనంటూ రోదించాడు. దుబాయ్‌లోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాకేశ్‌ సెల్ఫీ వీడియో స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.