యాప్నగరం

నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు.. పుట్ట మధు అనుచరుడి ఫేస్ బుక్ పోస్ట్

కమాన్‌పూర్ ఎంపీపీ బోనం వెంకటస్వామి చేసిన పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. తనకు సొంత పార్టీ నుంచే బెదిరింపులు వస్తున్నాయని... ఏక్షణం అయినా తన ప్రాణాలు పోవచ్చని పెట్టిన ఫేస్ బుక్ పోస్టు సంచలనంగా మారింది.

Samayam Telugu 12 May 2021, 9:00 am
అతని పేరు బోనం వెంకటస్వామి. కమాన్‌పూర్ ఎంపీపీ. పుట్ట మధు అనుచరుడు కూడా. ఆయన వెనుక ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కూడా జై పుట్ట మధన్న అంటూ పోస్టులు కూడా పెట్టారు. అలాంటి అతడు తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు కలకలం రేపుతోంది. తనకు సొంత పార్టీ నుంచే బెదిరింపులు మొదలయ్యాయని... తాను ఏ క్షణం అయిన చనిపోవచ్చు అంటూ ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు.
Samayam Telugu ఎంపీపీ ఫేస్ బుక్ పోస్టు


అయితే పుట్ట మధు పోలీసుల అదుపోలో నుండి బయటకు రాగానే ఇలా బెదిరింపులు మొదలయ్యాయి.
పూదరి సత్యనారాయణ , పుట్ట మధు ఇద్దరు కలిసి ... తనను వేధిస్తున్నట్లు బాధితుడు చెబుతున్నాడు. అయితే దీనిపై ఆయన ఫేస్ బుక్ ఫ్రెండ్స్ స్పందించారు. ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలన్నారు. చావుతో ఏ సమస్య పరిష్కారం కాదన్నారు. మరికొందరు రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమేనన్నారు. ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలన్నారు.

లాయర్ వామన్ రావు హత్య కేసులో పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకొని మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడ్ని విడిచి పెట్టారు. అయితే ఈ క్రమంలో బయటకు వచ్చిన పుట్ట మధ... పార్టీ నేతలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మరోసారి పోలీసుల విచారణకు హాజరైన పుట్ట మధు.. తనకు వామన్ రావు హత్యతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.