యాప్నగరం

Karimnagar MLC Elections: నోరుజారిన ‘సర్దార్’... షాకిచ్చిన పోలీసులు

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెట్‌గా పోటీచేస్తున్న సర్దార్ రవీందర్‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన మాట్లాడారంటూ ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Samayam Telugu 29 Nov 2021, 7:22 am

ప్రధానాంశాలు:

  • కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌పై కేసు నమోదు
  • ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడారంటూ ఫిర్యాదు
  • ఎంపీడీవో ఫిర్యాదుతో కేసు నమోదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రవీందర్ సింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి టీఆర్ఎస్‌కు షాకిచ్చారు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. టీఆర్ఎస్ అధిష్ఠానం రంగంలోకి దిగి బుజ్జగించినా ఆయన నామినేషన్ విత్‌డ్రా చేసుకోలేదు. తనకు మాటిచ్చి తప్పిన టీఆర్ఎస్‌కు ఎలాగైనా ఝలక్ ఇవ్వాలన్న లక్ష్యంతో అనేక మంది మద్దతు మూటగట్టుకుని ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారాయన. అయితే రవీందర్‌ సింగ్‌కు ఎన్నికల అధికారులు ఊహించని షాకిచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కరీంనగర్‌ గ్రామీణ ఎంపీడీవో ఫిర్యాదు చేశారు.
రవీందర్‌ సింగ్‌ కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీడియా సమావేశంలో ఓటర్లు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి తీసుకున్నా.. ఓటు మాత్రం తనకే వేయాలని రవీందర్‌ సింగ్‌ అన్నట్లు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రవీందర్‌సింగ్‌పై కేసు నమోదు అయింది. చాలాకాలంగా టీఆర్ఎస్‌లో ఉంటూ కరీంనగర్‌ మేయర్‌గా పనిచేసిన రవీందర్‌ సింగ్‌ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. తనకు ఎమ్మెల్సీ టికెట్‌ వస్తుందనే ఆశతో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్ఎస్ తరఫున ఎల్‌. రమణ, టి.భాను ప్రసాద్‌రావును పార్టీ బరిలోకి దించింది. దీంతో అధిష్ఠానంపై అలిగిన ఆయన పార్టీకి రాజీనామా చేసి స్వంతత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.