యాప్నగరం

కరీంనగర్: నోరుజారిన మేయర్.. అంతమాట అనేశారే.! రచ్చరచ్చ

లక్షలు ఖర్చు చేసి నాటిన మొక్కలను రాష్ట్రప్రభుతం కాపాడలేకపోయిందంటూ ఎండిపోయిన మొక్కలను బీజేపీ సభ్యులు మేయర్ వద్దకు తీసుకెళ్లి నిలదీశారు. సహనం కోల్పోయిన ఆయన నోరుజారారు. చివరికి..

Samayam Telugu 27 Jan 2021, 6:59 pm
కరీంనగర్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బుధవారం జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో బీజేపీ సభ్యుడిపై మేయర్ సునీల్ రావు నోరుజారడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నినాదాలు, వాగ్వాదాలతో సమావేశ మందిరం దద్దరిల్లింది. మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీ మహిళా సభ్యురాలు మాతృభావన హరిత హారంలో భాగంగా నగరంలో నాటిన మొక్కలన్నీ ఎండిపోయాయంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎండిపోయిన మొక్కలను తీసుకొచ్చి మేయర్ సునీల్ రావు ఎదుట నిరసనకు దిగారు. లక్షలు ఖర్చు చేసి నాటిన మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడలేకపోయిందంటూ బీజేపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
karimnagar


టీఆర్‌ఎస్ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు నినాదాలు చేసుకుంటూ.. తోపులాటకు దిగారు. ఒకానొక దశలో బాహాబాహీకి సైతం సిద్ధమయ్యారు. అసహనానికి గురైన మేయర్ సునీల్ రావు బీజేపీ సభ్యుడిని ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలో అంటూ దూషించడంతో దుమారం రేగింది. బీజేపీ సభ్యులు రెచ్చిపోయారు. మేయర్ వ్యాఖ్యలతో కౌన్సిల్ సమావేశం రణరంగంగా మారింది. సభ్యులను అవమానపరిచేలా మేయర్ మాట్లాడారని.. క్షమాపణ చెప్పాల్సిందేనంటూ బీజేపీ కార్పొరేటర్లు అక్కడే బైఠాయించారు. తీవ్ర ఆందోళనల నడుమ సమావేశం వాయిదాపడింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.