యాప్నగరం

KCR చిన్ననాటి స్నేహితుడు మృతి.. సరిగ్గా ఏడాది క్రితం సర్‌ప్రైజ్ చేసిన సీఎం!

ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఏడాది క్రితం ఆయన సీఎంను కలిశారు.

Samayam Telugu 12 Feb 2021, 3:07 pm
సీఎం కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ ఇక లేరు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కలకు చెందిన తిరునగరి సంపత్‌కుమార్‌ బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కేసీఆర్, సంపత్‌కుమార్‌ చదువుకునే రోజుల్లో మంచి మిత్రులు, ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. గత ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన సమయంలో సంపత్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
Samayam Telugu kcr-sampath kumar


హెలిప్యాడ్ నుంచి నడుచుకుంటూ వెళ్లే సమయంలో సంపత్ కుమార్‌ను గుర్తించిన కేసీఆర్.. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను తన దగ్గరకు రానివ్వకపోవడాన్ని గమనించారు. ఏయ్ సంపత్ ఇట్రా.. ఆయన మా దోస్తయ్యా.. ఆయన్ను జర రానీయిండ్రీ అంటూ సెక్యూరిటీ సిబ్బందికి సీఎం సూచించారు.

తన దగ్గరకు వచ్చిన సంపత్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. తనతోపాటు ఉన్న మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు సంపత్‌ను పరిచయం చేశారు. తన మిత్రుడైన కేసీఆర్‌తో కలిసి నడిచే వేళ.. ఆయన కళ్లలో కనిపించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.

‘‘స్కూలుకు పోయేటప్పుడు మేమిద్దరం కలిసి తిరిగినం.. ఆడుకున్నం.. ముచ్చట్లు జెప్పుకొనేటోల్లం.. ఇప్పుడా దోస్తు అందనంత ఎత్తుకు ఎదిగిండు.. మేమిద్దరం హైదరాబాద్‌లో సదువుకునేటప్పుడు ఒకే గదిల ఉండేటోళ్లం’’ అంటూ సంపత్ కుమార్ తమ చిన్నప్పటి స్మృతులను అప్పట్లో నెమరేసుకున్నారు. కాగా, సంపత్‌కుమార్‌ అవివాహితుడు కావడంతో ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.