యాప్నగరం

పుట్ట మధుకి షాక్.. సీబీఐ ఎంక్వైరీ కోసం హైకోర్టుకి..

వామన్‌ రావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధుకి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదని.. కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరారు.

Samayam Telugu 26 Feb 2021, 8:00 pm

ప్రధానాంశాలు:

  • పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు
  • సీబీఐకి అప్పగించాలని అభ్యర్థన
  • హైకోర్టును ఆశ్రయించిన వామన్ రావు తండ్రి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
putta madhu
హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకి షాక్ తగిలింది. కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదంటూ వామన్ రావు తండ్రి కిషన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు అక్రమాలను ప్రశ్నించినందుకే తన కొడుకు, కోడలిని కిరాతకంగా హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు నిష్పక్షపాత దర్యాప్తు చేయడం లేదని.. హత్య జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరపడం లేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంథని మండలం గుంజపడుగుకి చెందిన హైకోర్టు న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణిని దుండగులు అతి దారుణంగా నడిరోడ్డుపై హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీను, సహకరించిన మరో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో కత్తులు, కారు సమకూర్చిన పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను అరెస్టైన సంగతి తెలిసిందే.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.