యాప్నగరం

ఆత్రుత, అతివేగంతో ప్రాణాల మీదకి.. ఇరుక్కుపోయి నరకయాతన.. విషాదం

ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అతివేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న మరో బస్సుని ఢీకొట్టాడు. వాహనం నుంచి బయటికి రాలేక నరకయాతన అనుభవించాడు.

Samayam Telugu 27 Mar 2021, 6:53 pm
రోడ్డు నిబంధనలు పాటించాలని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ముందు వెళ్లాలన్న ఆత్రుతతో అతివేగంగా వాహనాలను నడిపి.. కంట్రోల్ చేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటన తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగింది. బస్సును ఓవర్ టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో బస్సుని ఢీకొట్టాడు. వాహనంలో నుజ్జునుజ్జు కావడంతో బయటికి రాలేక నరకయాతన అనుభవించాడు. ఈ ఘోర ప్రమాదం వివరాలు..
Samayam Telugu వాహనంలో ఇరుక్కుపోయిన అశోక్
accident


జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం డ్రైవర్ ముస్తాబాద్ అశోక్ ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించాడు. అతివేగంగా వాహనాన్ని నడిపి ఎదురుగా వచ్చిన మరో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. దీంతో టాటా ఏస్ క్యాబిన్ నుజ్జునుజ్జై అశోక్ అందులోనే ఇరుక్కుపోయి బయటికి రాలేక హాహాకారాలు చేశాడు. గంటలపాటు నరకయాతన అనుభవించాడు.

స్థానికులు స్పందించి అతన్ని బయటికి లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. భారీ క్రేన్ తీసుకువచ్చి అశోక్‌ని వాహనం నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో చివరకు గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి టాటా ఏస్ వాహనం డోర్ కట్ చేసి క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటికి తీశారు. 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.