యాప్నగరం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి లేఖ కలకలం.. తీవ్ర హెచ్చరికలు

పోలీసులు జనశక్తి ఉనికి లేదని చెబుతున్నారు. ఎస్పీకి ఉనికి తెలిసేలా చేస్తాం. ప్రజాధనం కాజేస్తున్న వారి చావుకేకలు త్వరలోనే వినిపిస్తాయంటూ జనశక్తి పేరిట విడుదలైన లేఖ వైరల్‌గా మారింది.

Samayam Telugu 21 Apr 2022, 3:08 pm
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోమారు మావోయిస్టుల కలకలం రేగింది. సీపీఐ(ఎంఎల్) జనశక్తి పేరిట కామ్రేడ్ జగన్ ఓ లేఖ విడుదల చేశారు. గతంలో పోరాటాలు చేసిన విప్లవ పార్టీలకు, జనశక్తికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో క్రియాశీలకంగా పనిచేసిన వారితో కూడా ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ స్వార్థం కోసం విప్లవ పార్టీలకు ద్రోహం చేసిన ద్రోహులను మాత్రం విడిచిపెట్టేది లేదని తీవ్ర హెచ్చరికలు చేశారు.
Samayam Telugu mao


జిల్లాలో జనశక్తి ఉనికే లేదని పోలీసులు చెబుతున్నారని.. త్వరలోనే సిరిసిల్ల ఎస్పీకి జనశక్తి ఉనికి తెలిసేలా చేస్తానని ఎల్లారెడ్డిపేట, చందుర్తి, మానాల దళ నాయకుడు జగన్ సవాల్ విసిరారు. పందికొక్కుల్లా ప్రజాధనాన్ని కాజేసిన వారి చావుకేకలు వినే రోజులు కూడా మరెంతో దూరంలో లేవని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. దశాబ్దకాలంగా పాలకులు, దళాలరుతో మోసపోతున్న అణగారిన ప్రజల కోసం పోరాడేందుకు జనశక్తి పిడికిలి బిగించిందని ఆయన అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, రైతులను మోసం చేస్తున్నాయని.. వారి మాటలకు మోసపోవద్దని లేఖలో సూచించారు. మీ పంట మీ ఇష్టమని.. టీఆర్ఎస్ నాయకుల మాటలు వినొద్దన్నారు. పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వందల ఎకరాల భూములు ఉన్న వారికి రైతు బంధు ఇచ్చి ఇంకా ధనవంతులను చేస్తున్నారని.. కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. అయితే త్వరలోనే చావుకేకలు వినపడతాయంటూ లేఖలో పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతోంది.

జనశక్తి పేరిట విడుదలైన లేఖ



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.