యాప్నగరం

మంత్రి కొప్పుల మంచి మనసు.. టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి రూ.86వేల సాయం

ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్న టీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్ కుటుంబానికి తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.86వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Samayam Telugu 25 Jan 2021, 12:38 pm
ఆత్మహత్య చేసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తను కుటుంబాన్ని ఆదుకుని మానవత్వం చాటుకున్న తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నెల 16న అతదు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రీకాంత్‌ తల్లిదండ్రులు బాబక్క-మల్లయ్య పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పేద కుటుంబం కావడంతో ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
Samayam Telugu శ్రీకాంత్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న టీఆర్ఎస్ నేతలు


Also Read: నల్గొండ: ఏడాదిగా పెళ్లి వాయిదా వేస్తున్న ప్రియుడు... దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి

ఇచ్చిన మాట ప్రకారం మంత్రి ఆదివారం శ్రీకాంత్ కుటుంబానికి ఆర్థికసాయం అందేలా చేశారు. ఆదివారం శ్రీకాంత్‌ దినకర్మ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల నాయకుల ద్వారా రూ.86వేల నగదును అతడి తల్లిదండ్రులకు అందజేశారు. మంచి మనుసుతో తమకు సాయం చేసిన మంత్రి ఈశ్వర్‌కు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.