కన్నబిడ్డని ఓ కసాయి తల్లి అంతమొందించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కొడుకును బావిలో పడేసి కన్నతల్లి హత్యచేసిన ఘటన కలకలం రేపింది. పెద్దపల్లి పట్టణంలోని మొగల్పురకు చెందిన శ్యామల.. కొడుకు బన్ని(14) మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. దీంతో కంటికి రెప్పాల్సిన కాపాడాల్సిన కన్న తల్లి కొడుకును చంపాలనుకుంది. పథకం ప్రకారం బిడ్డను ఇంట్ల నుంచి బయటకు తీసుకెళ్లింది.
ఆస్పత్రికి చికిత్స చేయించాలని చెప్పి సోమవారం ఇంట్లో నుంచి తీసుకెళ్లి వ్యవసాయ పొలంలోని బావిలోకి బన్నిని నెట్టివేసింది. ఈతరాకపోవడంతో ఆ బాలుడు బావిలో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకొని విచారించగా.. హత్య చేసింది శ్యామల అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఆస్పత్రికి చికిత్స చేయించాలని చెప్పి సోమవారం ఇంట్లో నుంచి తీసుకెళ్లి వ్యవసాయ పొలంలోని బావిలోకి బన్నిని నెట్టివేసింది. ఈతరాకపోవడంతో ఆ బాలుడు బావిలో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకొని విచారించగా.. హత్య చేసింది శ్యామల అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.