యాప్నగరం

14 ఏళ్ల కన్నబిడ్డను చంపిన తల్లి.. కారణం తెలిస్తే షాక్

ఆస్పత్రికి తీసుకువెళ్తున్నానంటూ కొడుకును వెంటబెట్టుకొని తల్లి శ్యామల బయటకు వెళ్లింది. అయితే మధ్యలో కొడుకుని పొలంలోని బావి వద్దకు తీసుకెళ్లింది. అందులోకి నెట్టేసింది.

Samayam Telugu 22 Jun 2021, 11:27 am
కన్నబిడ్డని ఓ కసాయి తల్లి అంతమొందించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కొడుకును బావిలో పడేసి కన్నతల్లి హత్యచేసిన ఘటన కలకలం రేపింది. పెద్దపల్లి పట్టణంలోని మొగల్‌పుర‌కు చెందిన శ్యామల.. కొడుకు బన్ని(14) మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. దీంతో కంటికి రెప్పాల్సిన కాపాడాల్సిన కన్న తల్లి కొడుకును చంపాలనుకుంది. పథకం ప్రకారం బిడ్డను ఇంట్ల నుంచి బయటకు తీసుకెళ్లింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఆస్పత్రికి చికిత్స చేయించాలని చెప్పి సోమవారం ఇంట్లో నుంచి తీసుకెళ్లి వ్యవసాయ పొలంలోని బావిలోకి బన్నిని నెట్టివేసింది. ఈతరాకపోవడంతో ఆ బాలుడు బావిలో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకొని విచారించగా.. హత్య చేసింది శ్యామల అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.