యాప్నగరం

పంచాయతీ కార్యదర్శి కక్కుర్తి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన సర్పంచ్ భర్త

ఇప్పటికే.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావట్లేదని సర్పంచులు లబోదిబోమంటున్నారు. అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీరా బిల్లులు వచ్చాక.. వాటిని చెల్లించేందుకు ప్రభుత్వ అధికారులు మాత్రం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. అలా ఓ పంచాయతీ కార్యదర్శి లంచానికి కక్కుర్తి పడటంతో.. ఆ గ్రామ సర్పంచ్ భర్త ఏసీబీని ఆశ్రయించారు. పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని రేచపల్లిలో చోటుచేసుకుంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 24 Mar 2023, 5:26 pm

ప్రధానాంశాలు:

  • లంచం తీసుకుంటూ దొరికిపోయిన పంచాయతీ కార్యదర్శి
  • రూ. 10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన సర్పంచ్ భర్త

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bribe
లంచం
పంచాయతీ కారదర్శి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు ఆ గ్రామ సర్పంచ్ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో జరిగింది. పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి.. గ్రామ సర్పంచ్ నుంచి శుక్రవారం రోజున 10 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబి అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాలు వెల్లడించారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించగా.. వాటికి ఖర్చయిన బిల్లులు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మిని సర్పంచ్ కోరారు. బిల్లులు విడుదల చేయాలంటే.. తనకు 10 వేలు లంచంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది.
లంచం ఇవ్వటం ఇష్టం లేని సర్పంచ్.. ఈ నెల 17న కరీంనగర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు శుక్రవారం రోజు గ్రామ పంచాయతీ వద్ద 10 వేల రూపాయలు లంచం ఇస్తుండగా.. ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. శనివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.

అయితే.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే.. ఆత్మహత్యల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. పలు చోట్ల సర్పంచులు అప్పులు చేసి మరీ.. అభివృద్ధి పనులు చేపట్టారు. బిల్లులు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. వచ్చిన బిల్లులను సర్పంచులకు ఇచ్చేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇలా లంచాలు అడుగుతుండటం గమనార్హం.

'కేటీఆరే నెక్స్ట్ సీఎం.. హైదరాబాద్‌ మీదే పూర్తి ఫోకస్'
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.