యాప్నగరం

పుట్ట శైలజకు నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం

హైకోర్టు లాయర్ వామన్ రావు హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పుట్టా మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇదే కేసు విషయమై ఆయన భార్య శైలజకు కూడా పోలీసులు నోటీసులు పంపారు.

Samayam Telugu 9 May 2021, 1:25 pm
మంథని మాజీ ఎమ్మెల్యే , పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు భార్య మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్టా శైలజకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. హైకోర్టు లాయర్ వామన్ రావు హత్యకేసులో శైలజను విచారణకు హాజరు కావాలని కోరడంతో ఆమె ఆదివారం రామగుండం కమిషనరేట్ పోలీసులు ఎదటు హాజరయినట్లు తెలుస్తోంది.
Samayam Telugu పుట్టా శైలజ, పుట్టా మధు


మరోవైపు పుట్టా మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. ఏపీలోని భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసు కొచ్చారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేశారు.

ఈ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులకు పుట్ట మధు రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారని, ప్రధాన నిందితుడు కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, దీని వెనకాల జెడ్పీ చైర్మన్‌ ఉన్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఈనెల 16న ఐజీ నాగిరెడ్డికి పిర్యాదు చేశారు.మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న పుట్టా మధు విచారణ కొనసాగుతోంది. లాయర్ హత్యకు ముందు రూ. 2 కోట్లు ఎందుకు డ్రా చేశారనే కోణంలో విచారిస్తున్నారు. ఆ సొమ్ము ఎవరికి ఇచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.