యాప్నగరం

జమ్మి ఆకు కోసం ఎగబడిన జనం.. జగిత్యాలలో లాఠీచార్జి

దసరా వేడుకల్లో భాగంగా జగిత్యాలలోని వేణుగోపాలస్వామి వారు జంబిగద్దెకు చేరుకుని పూజలందుకుంటారు. జమ్మి ఆకు తెంపి వేడుకల ప్రారంభిస్తారు. ఈ వేడుకల్లో లాఠీచార్జి జరిగింది.

Samayam Telugu 15 Oct 2021, 6:23 pm
దసరా ఉత్సవాల్లో జమ్మిచెట్టుకి ఎనలేని ప్రాధాన్యముంది. పండగ పూట జమ్మిచెట్టుకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. జమ్మి చెట్టు ఇంట ఉంటే శుభప్రదమని చెబుతారు. పూర్వంలో ఇళ్లలోనే ఉండే జమ్మిచెట్టు కాలక్రమేణా కనుమరుగు కావడంతో పండగ పూట జమ్మిచెట్టు కోసం వెతుకులాట తప్పడం లేదు. అలాంటి జమ్మి ఆకు కోసం వెళ్లిన జనంపై లాఠీచార్జి చేసిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జనం ఒక్కసారిగా ఎగబడడంతో పోలీసులు లాఠీ ఝుళిపించాల్సి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
lathi charge


దసరా వేడుకల్లో భాగంగా జగిత్యాల బ్రాహ్మణ వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ఆనవాయితీగా స్వామివారు జంబిగద్దెకు చేరుకుని పూజలందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పండుగ పూట స్వామివారు జంబిగద్దెకు చేరుకోగానే కలెక్టర్ రవి సహా పలువురు ప్రముఖులు హాజరై వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ జమ్మి ఆకు తెంపి లోపలికి వెళ్లగానే జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. జమ్మి ఆకు కోసం తోపులాటకు దిగడంతో వారిని అదుపుచేయడం కష్టతరంగా మారింది. జనాన్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.