యాప్నగరం

మంత్రికి సర్జరీ చేసిన మేయర్.. సీఎం టూర్ తర్వాత నేరుగా హాస్పిటల్‌కు!

KCR కాళేశ్వరం పర్యటన ముగిసిన తర్వాత తిరిగి వస్తోన్న క్రమంలో కడుపు నొప్పితో బాధపడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు రామగుండం మేయర్ సర్జరీ చేశారు.

Samayam Telugu 20 Jan 2021, 2:50 pm
గోదావరిఖని: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌కు రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మంగళవారం సర్జరీ చేశారు. మంత్రి కడుపులో ఎడమ భాగంలో కణితి ఏర్పడింది. ఆపరేషన్ చేసి దాన్ని తొలగించాలని డాక్టర్లు ఇదివరకే ఆయనకు సూచించారు. కానీ ఆయన సర్జరీ చేయించుకోవడం కుదర్లేదు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన సందర్భంగా.. మంత్రి ఈశ్వర్ ఆయనకు స్వాగతం పలికారు. సీఎం పర్యటన ముగిశాక తిరిగి వస్తుండగా.. మంత్రికి కడుపులో నొప్పి ఎక్కువైంది.
Samayam Telugu koppula eshwar | Image: FB


మంత్రితోపాటు కారులో ప్రయాణిస్తున్న మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్‌.. ఆయన్ను స్వయంగా గోదావరిఖనిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించి వెంటనే సర్జరీ చేసి 3 సెంటీమీటర్ల పొడవైన కణతిని తొలగించారు. ఆపరేషన్‌ జరిగినంత సేపు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఆపరేషన్‌ పూర్తయిన అరగంట తర్వాత మంత్రి కొప్పుల హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆయన షెడ్యూల్ ప్రకారమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.