యాప్నగరం

నిప్పుల్లో నడిచిన ఎమ్మెల్యే.. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

అంతర్గాం నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్ర్యత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చందర్ పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు చేసిన ఎమ్మెల్యే.. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడిచారు.

Samayam Telugu 1 Apr 2022, 8:04 pm
నిప్పులపై నడిచారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అగ్ని గుండంలో నడిచి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతర్గాంలోని నూకాంబిక అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో నిప్పులపై నడిచారు. శిరస్సుపై కలశం ధరించి నిప్పులపై నడుచుకుంటూ వచ్చారు.
Samayam Telugu chander


రామగుండం ప్రజలు చల్లగా ఉండాలని అగ్ని గుండంలో నడిచినట్లు ఎమ్మెల్యే చందర్ చెప్పారు. రామగుండం ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. రామగుండం నియోజవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మండల కేంద్రంలో త్వరలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయనున్ట్లు చందర్ తెలిపారు. అంతర్గాంకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆయ అన్నారు.

రామగుండం నియోజవర్గ ప్రజల దశాబ్దాల కల మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయించామన్నారు. వచ్చే ఆగస్టు నుంచి మెడికల్ కళాశాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.