‘సంజయ్ ఏం ప్రాజెక్టు తెచ్చినవ్..? ఆ తర్వాత ఈటల ఇక్కడ ఉండడు’
మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్పై మంత్రి తలసాని యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu 20 Oct 2021, 6:30 pm
ప్రధానాంశాలు:
- మంత్రి తలసాని కామెంట్లు..
- దళిత బంధును బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేయాలి
- 2, 3 నెలల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి
బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లు అయ్యిందని.. ఆయన ఇప్పటివరకు కరీంనగర్కు ఏం ప్రాజెక్టు తీసుకువచ్చాడో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని.. దమ్ముంటే ఏదైనా ప్రాజెక్టు తెచ్చి ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. దళిత బంధు ఒక్క నియోజకవర్గం కోసం తెచ్చింది కాదని.. రాష్ట్రమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో తలసాని మాట్లాడారు.. నవంబర్ 2 తర్వాత ఈటల పరిస్థితి ఏంటో తెలుస్తుందని.. ఆ తర్వాత ఆయన ఇక్కడ ఉండబోడన్నారు. ఈటల హుజూరాబాద్లో మంత్రిగా ఉన్నాడని తాము ఇంతవరకు హుజూరాబాద్కు రాలేదన్నారు. సీఎం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా హుజూరాబాద్నే సెంటిమెంట్గా తీసుకుంటారని వెల్లడించారు. రైతుబంధు స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్ అన్న ఈటల.. దళిత బంధును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని కామెంట్ చేశారు.
మత్స్యకారులను, గంగపుత్రులను ఈటల ఎప్పుడూ పట్టించుకోలేదని తలసాని ఆరోపించారు. ఇప్పటి వరకు లక్షా 14 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మరో రెండు, మూడు నెలల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. దళిత బంధు హుజూరాబాద్ కోసం పెట్టలేదని ఏడాది క్రితమే అసెంబ్లీలో 1,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారని తెలిపారు.
మత్స్యకారులను, గంగపుత్రులను ఈటల ఎప్పుడూ పట్టించుకోలేదని తలసాని ఆరోపించారు. ఇప్పటి వరకు లక్షా 14 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మరో రెండు, మూడు నెలల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. దళిత బంధు హుజూరాబాద్ కోసం పెట్టలేదని ఏడాది క్రితమే అసెంబ్లీలో 1,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారని తెలిపారు.