యాప్నగరం

టీఆర్ఎస్, బీజేపీ కొట్లాట.. కిందపడ్డ సీఐ

బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. దీంతో అక్కడకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.

Samayam Telugu 24 Jan 2021, 2:34 pm
కరీంనగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం వారు లెక్కచేయలేదు. దీంతో ఈ ఘర్షణలో కరీంనగర్ టూ టౌన్ సీఐ అక్ష్మీబాబు తోపులాటలో కిందపడిపోయారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు.
Samayam Telugu టీఆర్ఎస్ బీజేపీ కొట్లాట


Read More: తెలంగాణలో షర్మిల పార్టీపై.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

దీంతో తెలంగాణ చౌక్‌లో బండి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త ఘర్షణకు తెరదీసింది. దీంతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడినట్లుగా సమాచారం. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.