యాప్నగరం

షాపు బోర్డు మారుస్తుండగా విద్యుత్ తీగలకు తగిలి యువకుల మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. బేకరీ షాపు వద్ద బోర్డు మారుస్తుండగా ప్రమాదశవాత్తూ విద్యుత్ తీగలకు తగిలింది. కరెంట్ ప్రసారమై ఇద్దరు యువకులు అక్కడికక్కడే కుప్పకూలి దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన వినీత్, వికాస్‌గా గుర్తించారు. మెట్‌పల్లి పట్టణంలో తన స్నేహితుడికి సంబంధించిన బేకరి షాప్ వద్ద.. బోర్డు మారుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 27 Sep 2022, 6:38 pm
గిత్యాల జిల్లా మెట్‌పల్లిలో (Metpally) విషాదం చోటు చేసుకుంది. బేకరీ షాపు వద్ద బోర్డు మారుస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన వినీత్, వికాస్‌గా గుర్తించారు. మంగళవారం (సెప్టెంబర్ 27) మెట్‌పల్లి పట్టణంలో తన స్నేహితుడికి సంబంధించిన బేకరి షాప్ వద్ద.. బోర్డు మారుస్తుండగా ప్రమాదవశాత్తూ అది 11 కె.వి. విద్యుత్ తీగలకు తాకింది. విద్యుత్ ప్రసారం కావడంతో వికాస్, వినీత్ షాక్‌కు గురై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.
Samayam Telugu Current shock
ప్రతీకాత్మక చిత్రం


గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహలను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వికాస్, వినీత్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.