యాప్నగరం

ఆరగించి వెళ్లిపో తల్లి .. కరోనా దేవతకు మేకపోతు.. వెరైటీ పూజలు

కరోనా బొమ్మ తయారు చేశారు. దానికి పసుపు కుంకుమ రాశారు. నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. మేకపోతును బలిస్తావమ్మా.. మమ్మల్ని వదిలి వెళ్లిపో అంటూ పూజలు చేశారు.

Samayam Telugu 17 May 2021, 2:27 pm
తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్‌తో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలు మరోసారి వైరస్ భయంతో వణికిపోతున్నారు. జిల్లాలు, పట్టణాలు, పల్లెల్లో ఇలా ఎక్కడా కూడా కరోనా కేసులు వదలడం లేదు. దీంతో కొందరు ప్రజలు.. కరోనా నుంచి తమను కాపాడాలంటూ గ్రామ దేవతలకు... పూజలు, పురస్కారాలు కూడా చేయడం మనం చూశాం. కానీ తెలంగాణలో ఓ గ్రామ ప్రజలకు వెరైటీగా కరోనా దేవతకే పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన బుడిగె జంగాల ప్రజలు ఈ వింత పూజలు చేశారు.
Samayam Telugu కరోనా కోసం పూజలు (ఫైల్ ఫోటో)


కరోనా వైరస్‌ను పోలిన బొమ్మను తయారు చేసి, దానిపై పసుపు, కుంకుమలతో పూజించి పూజలు చేశారు. కరోనా మహమ్మారి తల్లి.. మమ్ముల్ని కనికరించు.. మముల్ని, దేశాన్ని వదిలి వెళ్లిపో తల్లి.. నీకు మేకపోతును నైవేధ్యంగా ఇస్తున్నాం.. ఆరగించి మాయమైపో మాయమ్మ.. అంటూ గోదావరిఖని పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన బుడిగె జంగాల కాలనీ వాసులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలను విడిచి వెళ్లాలని కరోనాను దేవతగా అభివర్ణిస్తూ వేడుకున్నారు.

కరోనా సోకి ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న చాలామంది చనిపోతుండడం బుడిగె జంగాలనుత కలిచి వేసింది. ఇళ్లలో ఉన్న వారిని కూడా వెంటపడి మరీ వ్యాధి సోకుతుండడంతో బుడిగె జంగాలు చివరకు కరోనా వైరస్ నే వేడుకుంటే కనికరిస్తుందేమోనన్న ఆశతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే వెరైటీగా కరోనా దేవతకు ప్రజలు పూజలు చేయడం ఆసక్తికరంగా మారింది.ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.