వంటలు చేసుకొని జీవనం సాగించే ఓ మహిళ ఓ యువకుడిని నిలువునా ముంచింది. ఫోన్లు చేసి ఏకంగా లక్షల కొద్దీ డబ్బు వసూలు చేసింది. వేములవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ శనివారం రాత్రి విలేకరులకు వివరాలు వెల్లడించాడు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. వేములవాడలో ఫంక్షన్లు, ఇతర కార్యాలకు వంటలు చేస్తుండే ఓ మహిళకు దుబాయిలో ఉండే వేములవాడ మండలానికి చెందిన ఓ యువకుడి ఫోన్ నంబర్ లభించింది. మాటలతో అతడిని మాయ చేసి, పేర్లు మార్చి మరీ పలుసార్లు ఫోన్ చేసి ఏకంగా రూ.15లక్షలు వసూలు చేసింది. చివరికి మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వేములవాడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శనివారం ఆమెను అరెస్టు చేశారు.
వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన బాధితుడు దుబాయిలో పని చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన పుట్ట సునీత అనే మహిళ శుభకార్యాల్లో వంట పని చేస్తూ ఉంటుంది. ఆమెకు ఓ పుస్తకంలో బాధితుడి ఫోన్నంబర్ లభించింది. ఆ నంబరుతో ఆమె చాటింగ్ ప్రారంభించింది. తనని తాను హైదరాబాద్కు చెందిన నందుగా పరిచయం చేసుకుంది. టిక్టాక్లో ఫొటోలు, వీడియోలు పెట్టి అవి తనవేనని నమ్మించింది. మూడు నెలలు ఇలా గడిచిన తర్వాత గొంతుమార్చి తన పేరు వైశు అని మరో మహిళగా పరిచయం చేసుకుంది. తాను నందు స్నేహితురాలినని నమ్మించింది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తుండగా నందు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిందని చెప్పింది. ఆమె ఫోన్లో మీ ఇద్దరి ఫొటోలు ఉన్నాయని, తనకు కొంత డబ్బు ఇస్తే ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పనని బెదిరింపులకు పాల్పడింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు తన పేరు సునీత అని మళ్లీ బాధితుడికి ఫోన్ చేసి.. తన స్నేహితురాళ్లు నందు, వైశు ఇద్దరూ మృతిచెందారని చెప్పింది. ఇందుకు నువ్వే కారణమని మళ్లీ డబ్బు డిమాండ్ చేసింది. ఇలా అతనికి మరో వ్యక్తికి చెందిన బ్యాంకు అకౌంట్ నంబరు ఇచ్చి డబ్బు వేయాలని సూచించింది. డబ్బులు పంపకుంటే ఇద్దరి మృతికి నువ్వే కారణమని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పేస్తానని బెదిరించింది. భయానికి గురైన బాధితుడు ఖాతా నంబరుకు డబ్బులు పంపించాడు. ఇలా మొత్తం రూ.15లక్షల వరకు పంపించాడు.
ఆ తర్వాత దుబాయి నుంచి వచ్చిన గంగారెడ్డి ఈ విషయంపై ఈ నెల 8న వేములవాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు మహిళ, ఆమెకు సహకరించిన వ్యక్తిని వేములవాడలో శనివారం అరెస్టు చేశారు. సునీతను విచారణ జరిపి ఆమె నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన బాధితుడు దుబాయిలో పని చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన పుట్ట సునీత అనే మహిళ శుభకార్యాల్లో వంట పని చేస్తూ ఉంటుంది. ఆమెకు ఓ పుస్తకంలో బాధితుడి ఫోన్నంబర్ లభించింది. ఆ నంబరుతో ఆమె చాటింగ్ ప్రారంభించింది. తనని తాను హైదరాబాద్కు చెందిన నందుగా పరిచయం చేసుకుంది. టిక్టాక్లో ఫొటోలు, వీడియోలు పెట్టి అవి తనవేనని నమ్మించింది. మూడు నెలలు ఇలా గడిచిన తర్వాత గొంతుమార్చి తన పేరు వైశు అని మరో మహిళగా పరిచయం చేసుకుంది. తాను నందు స్నేహితురాలినని నమ్మించింది. హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తుండగా నందు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిందని చెప్పింది. ఆమె ఫోన్లో మీ ఇద్దరి ఫొటోలు ఉన్నాయని, తనకు కొంత డబ్బు ఇస్తే ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పనని బెదిరింపులకు పాల్పడింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు తన పేరు సునీత అని మళ్లీ బాధితుడికి ఫోన్ చేసి.. తన స్నేహితురాళ్లు నందు, వైశు ఇద్దరూ మృతిచెందారని చెప్పింది. ఇందుకు నువ్వే కారణమని మళ్లీ డబ్బు డిమాండ్ చేసింది. ఇలా అతనికి మరో వ్యక్తికి చెందిన బ్యాంకు అకౌంట్ నంబరు ఇచ్చి డబ్బు వేయాలని సూచించింది. డబ్బులు పంపకుంటే ఇద్దరి మృతికి నువ్వే కారణమని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పేస్తానని బెదిరించింది. భయానికి గురైన బాధితుడు ఖాతా నంబరుకు డబ్బులు పంపించాడు. ఇలా మొత్తం రూ.15లక్షల వరకు పంపించాడు.
ఆ తర్వాత దుబాయి నుంచి వచ్చిన గంగారెడ్డి ఈ విషయంపై ఈ నెల 8న వేములవాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు మహిళ, ఆమెకు సహకరించిన వ్యక్తిని వేములవాడలో శనివారం అరెస్టు చేశారు. సునీతను విచారణ జరిపి ఆమె నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.