దేశమంతా రెండో దశలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో కరోనా వైరస్ కట్టడికి ప్రజలు ఎక్కువ చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో కొన్ని గ్రామాల్లో ప్రజలు వారికి వారు స్వయంగా తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొన్ని గ్రామాల వారు సొంతంగా స్వీయ లాక్డౌన్ అమలు చేసుకుంటుండగా.. మరికొందరు కఠినమైన ఆంక్షలు విధించుకుంటున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో జనం గుమికూడకుండా గ్రామ పెద్దలు చర్యలు తీసుకుంటున్నారు. జనాల్లో అవగాహన కల్పించేందుకు దండోరాలు వేయించడం, మైకుల్లో కరోనా వ్యాప్తి గురించి ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు. జనాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వేములవాడ మండలం ఆరెపల్లిలో కరోనా మహమ్మారి బెంబేలెత్తిస్తున్న వేళ వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు వారు అమలు చేస్తున్న విధానం ఆకట్టుకుంటోంది. జనం ఒక చోట చేరకుండా వారు వినూత్న విధానం చేపట్టారు.
గ్రామంలో ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన స్థానికులు కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామ కూడలిలో ఉండే సిమెంట్ బెంచీల్లో జనం కూర్చోకుండా వాటిని తలకిందులు చేశారు. గ్రామస్థులు లేదా వేరే ఊరివాళ్లు ఒకచోట చేరకుండా అలా చేశారు. సాధారణంగా గ్రామాల్లో పెద్దలు ఇలాంటి బెంచీలపై కూర్చొని గంటలతరబడి పిచ్చాపాటి మాట్లాడుకునే విషయం తెలిసిందే. దీంతో జనం ఎవరికి వారు ఇళ్లలోనే ఉంటున్నారు.
గ్రామంలో ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన స్థానికులు కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామ కూడలిలో ఉండే సిమెంట్ బెంచీల్లో జనం కూర్చోకుండా వాటిని తలకిందులు చేశారు. గ్రామస్థులు లేదా వేరే ఊరివాళ్లు ఒకచోట చేరకుండా అలా చేశారు. సాధారణంగా గ్రామాల్లో పెద్దలు ఇలాంటి బెంచీలపై కూర్చొని గంటలతరబడి పిచ్చాపాటి మాట్లాడుకునే విషయం తెలిసిందే. దీంతో జనం ఎవరికి వారు ఇళ్లలోనే ఉంటున్నారు.