యాప్నగరం

ఆగిపోయిన అంబులెన్స్.. నిలిచిపోయిన ప్రాణం!

Bhadradri Kothagudem Woman Death: కీలక సమయంలో ప్రాణాలను నిలబెట్టాల్సిన అంబులెన్స్ మార్గమధ్యంలో నిలిచిపోయింది. మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. అంబులెన్స్‌ను స్టార్ట్ చేసేందుకు అర్ధగంట పాటు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో రోగిని బైక్‌పై ఎక్కించుకొని చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువులు బోరున విలపించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 1 Jul 2022, 6:38 pm
పద సమయంలో ప్రాణాలను నిలబెట్టాల్సిన 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది. మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొత్తగూడెం జిల్లా చర్లలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన గొత్తికోయ మహిళ మాడవి చుకిడీ (25) కుటుంబ సమస్యల కారణంగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు గురువారం (జూన్ 30) ఉదయం గమనించి 108కు ఫోన్ చేశారు. దీంతో చర్లకు చెందిన 108 అంబులెన్స్‌ అక్కడికి చేరుకుంది. బాధిత మహిళను తీసుకొని ఆ అంబులెన్స్ ఆసుపత్రికి బయల్దేరింది. అటవీ మార్గంలో ఓ చోట ఆగిపోయింది.
Samayam Telugu నిలిచిపోయిన అంబులెన్స్
Kothagudem Ambulance


సిబ్బంది, మహిళ బంధువులు కిందికి దిగి తోసినా అంబులెన్స్ స్టార్ట్ కాలేదు. సుమారు అర్ధగంట సేపు ప్రయత్నించిన తర్వాత బాధిత మహిళ చుకిడీని బైక్‌పై కూర్చోబెట్టుకొని చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ వార్త వినగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

అంబులెన్స్ మొరాయించి ఉండకపోతే చుకిడీ బతికేదని బంధువులు చెబుతున్నారు. కొంతకాలంగా 108 అంబులెన్స్ సరిగా పని చేయడం లేదని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అంబులెన్స్ సిబ్బంది చెబుతున్నారు.

Also Read:

అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్‌ బిర్యానీ

జగన్నాథ యాత్ర: జనసంద్రమైన పూరీ.. ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో పటిష్ట భద్రత
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.