యాప్నగరం

భద్రాద్రి: మండల కేంద్రమే కదాని మందేసి లారీ నడిపాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

అది ఓ చిన్న మండల కేంద్రం.. పెద్దగా హడావుడి ఉండదు. కానీ పోలీసులు మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తూ కంటపడితే వెంటనే అలర్ట్ అవుతారు.

Samayam Telugu 26 Feb 2021, 9:25 pm
ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమయ్యేవి. క్రమంగా వాటిని పట్టణాలకు, మండల కేంద్రాలకు సైతం విస్తరించారు. హైదరాబాద్ లాంటి నగరంలో మద్యం సేవి వాహనం నడుపుతూ రోజూ పదుల సంఖ్యలో వాహనదారులు పట్టుబడుతుంటారు. గ్రామీణ ప్రాంతమే కదా ఏం కాదులే అనే ధీమాతో కొందరు తాగి వాహనం నడుపుతూ అడ్డంగా బుక్కవుతున్నారు.
Samayam Telugu drunk-driving-generic-toi
Image used for representational purpose only


2018-19లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన భద్రాద్రి జిల్లా పోలీసులు కరోనా కారణంగా 2020లో వాటి జోలికి పెద్దగా వెళ్లలేదు. కానీ ఇటీవలే మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతున్నారు. తాగి లారీ నడిపిన ఓ డ్రైవర్‌ను అశ్వాపురం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. భద్రాచలానికి చెందిన ఆ డ్రైవర్‌ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో.. అశ్వాపురం సీఐ సట్ల రాజు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసిన పోలీసులు.. మణుగూరు న్యాయస్థానంలో హాజరుపర్చారు.

కేసును విచారించిన మెజిస్ట్రేట్ తాగి వాహనం నడిపిన లారీ డ్రైవర్‌కు ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని.. తాగి బండి నడిపితే చర్యలు తీసుకుంటామని సీఐ సట్ల రాజు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.