యాప్నగరం

భద్రాద్రి రాముడికి భారీ కానుక.. బంగారు చీర, పాదాలు బహుకరించిన భక్తుడు

బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు.వ వీటి బరువు 13.50 కిలోలు. ఇంతవరకు స్వామివారికి ఇంత బంగారు కానుక ఏ భక్తుడు ఇవ్వలేదని ఆలయ పూజారులు చెబుతున్నారు.

Samayam Telugu 15 Jun 2021, 1:45 pm
భద్రాచలం సీతారామస్వామి వారి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో రాముల వారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. అటువంటి శ్రీరామునికి సీతమ్మకి ఓ దాత అరుదైన కానుక అందించారు. సీతమ్మకు స్వర్ణ కవచంతో కూడిన బంగారు చీర, రామయ్యకు బంగారు పాదాల్ని బహూకరించారు. భద్రాద్రి దేవస్థానంకు చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు.
Samayam Telugu భద్రాద్రి రాముడికి అరుదైన కానుక


ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం.
ఇకనుంచీ భద్రాద్రిలో ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు ఎవ్వరు లేరు. ఇంత పెద్ద మొత్తంలో దేవునికి స్వర్ణకవచ చాలు ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో ఈ కాను చరిత్రలో నిలిచిపోతుందని అక్కడి పూజారులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.