యాప్నగరం

భక్తులు లేకుండానే భద్రాద్రి రాముడి కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

రాముడి కళ్యాణం వైభవంగా కొనసాగుతోంది. అయితే కరోనా కారణంగా ఈ సారి మాత్రం భక్తులు ఎవరూ స్వామివారి కళ్యాణానికి రాలేకపోయారు.దీంతో కేవలం అర్చకులు అతికొద్దిమంది అతిథుల సమక్షలోనే స్వామి వారి కళ్యాణం జరుగుతోంది.

Samayam Telugu 21 Apr 2021, 11:19 am

ప్రధానాంశాలు:

  • నిరాడంబరంగా భద్రాద్రి రాముడి కళ్యాణం
  • కోవిడ్ కారణంగా భక్తులకు అనుమతి నిరాకరణ
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu భద్రాద్రి రాముడి కళ్యాణం
కరోనా వైరస్ ప్రభావం అన్ని పండగలపై పడింది. దీంతో రాష్ట్రంలో పండగలన్నీ కళ తప్పాయి. తాజాగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణోత్సవం భక్తుల లేకుండానే జరుగుతుంది. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాముల వారి కళ్యాణం కళ్లార చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు.
ఈ ఏడాది కూడా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భక్తులను అనుమతించలేదు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణఘట్టం ప్రారంభం అయ్యింది. కరోనా నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతిని నిరాకరించారు. సీతారాములకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాముల కల్యాణ మహోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మంది అథితులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొందరు అర్చక స్వాములు రామయ్య తరఫున, మరికొందరు అర్చకులు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు. రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం జరగనుంది. కోవిడ్‌ కారణంగా ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.