యాప్నగరం

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా

పెళ్లికి వెళ్లి వస్తుండగా బస్సు బోల్తా పడిన విషాద ఘటన జరిగింది. రోడ్డుపక్కన పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 23 మందికిపైగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 1 Sep 2021, 8:31 pm
ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వెళ్లి వస్తున్న సమయంలో బస్సు బోల్తా పడింది. స్టీరింగ్ పని చేయకపోవడంతో బస్సు రోడ్డు పక్కనున్న పొలాల్లోకి అమాంతం దూసుకుపోయి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. కామేపల్లి మండలం ముచ్చర్లలో వివాహానికి హాజరూ తిరిగి వస్తుండగా కూసుమచి మండలం సీతారాపురం సమీపంలో బస్సు అదుపుతప్పింది. స్టీరింగ్ పనిచేయకపోవడంతో బస్సు రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని 23 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu బోల్తా పడిన బస్సు
bus


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.