యాప్నగరం

BRS: కేరళలోనూ తెలంగాణ పథకాల అమలుకు ప్రయత్నిస్తా: పినరయి విజయన్

Khammam: ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్ నిప్పులు చెరిగారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 18 Jan 2023, 4:34 pm

ప్రధానాంశాలు:

  • కేంద్రంపై నిప్పులు చెరిగిన కేరళ సీఎం
  • సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తుందని మండిపాటు
  • కేసీఆర్ పోరాటానికి మద్దతిస్తున్నట్లు వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pinarayi Vijayan
కేరళ సీఎం పినరయి విజయన్
Khammam: ఖమ్మంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభ దేశానికి ఓ దిక్సూచి అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగిస్తున్నారని.., కేంద్రంపై పోరాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుం బిగించారని వ్యాఖ్యనించారు. ఖమ్మం సభలో ప్రసంగించిన ఆయన.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారు.
"ఈ సభ దేశానికి ఓ దిక్సూచి. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారు. కేసీఆర్ పోరాటనికి మద్దతు పలుకుదాం. కేరళ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారింది. కేంద్ర వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతోంది. రాష్ట్రాల హక్కులను, అధికారాలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి.

కేంద్రం గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ పోరాడాలి. స్వాతంత్ర్య సంమరంలో పాల్గొనని శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. కేంద్ర వైఖరితో లౌకితత్వం ప్రమాదంలో పడుతోంది. సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోంది.

వన్ నేషన్ - వన్ ట్యాక్స్, వన్ నేషన్ - వన్ ఎలక్షన్ వంటి నినాదాలు సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి. బీజేపీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది బీజేపీ ఆర్ఎస్‌ఎస్ సంయుక్తంగా దేశాన్ని పాలిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బలహీనపరుస్తోంది. ఎన్నికైన ప్రభుత్వాలను అనైతిక పద్దతుల్లో కూలుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది దేశ విశిష్టత. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోంది. తెలంగాణ పోరాటల పురిటిగడ్డ. తెలంగాణ సాయుధ పోరాటం భూసంస్కరణలకు కారణమైంది. తెలంగాణలో పథకాలు బాగున్నాయి. కేరళలోనూ తెలంగాణ పథకాల అమలుకు ప్రయత్నిస్తాం." అని పినరయి విజయన్ వ్యాఖ్యనించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.