యాప్నగరం

స్కూల్‌లో పాఠాలు చెబుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఆశ్రమ పాఠశాలను ఆమె సందర్శించారు. అక్కడ విద్యార్తులతో మాట్లాడారు, పదోతరగతి విద్యార్థులకు సోషల్ బుక్‌లో ఓ పాఠాన్ని బోధించారు.

Samayam Telugu 7 Feb 2021, 1:47 pm
ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి వార్తాల్లోకి ఎక్కారు. ఈసారి ఆమె టీచర్‌గా మారారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించారు. శనివారం పాఠశాలను సందర్శించిన సీతక్క అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి సాంఘిక శాస్త్రంలోని ‘ఎవరి అభివృద్ధి?’ అనే పాఠాన్ని విద్యార్థులకు బోధించారు. ప్రజల అభిప్రాయం మేరకు అభివృద్ధి సాధించినప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని విద్యార్థులకు వివరించారు సీతక్క.
Samayam Telugu కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క


సీతక్క ఎప్పుడూ వార్తల్లో నిలుస్తు ఉంటారు. తనకు తోచిన సాయం చేస్తూ ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గిరిపుత్రల విషయంలో సీతక్క చేసిన సేవ మరిచిపోలేనిది. తన నియోజకవర్గ ప్రజలకు నిత్యం సేవ చేస్తూ... ఎలాంటి కష్టం వచ్చినా ఆమె వెంటనే ఆదుకుంటారు. గతంలో కరోనా లాక్ డౌన్ కారణంగా గిరిజన గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడున్న వారికి నిత్యావసరాలు అందించారు ఎమ్మెల్యే సీతక్క. అంతేకాకుండా వరద ముంపు బాధితులను చేయూతనందించారు. రోడ్డు మార్గం లేకపోవడంతో పడవలో వెళ్లిన ఎమ్మెల్యే.. స్వయంగా దుప్పట్లను తలపై పెట్టుకొని మోసుకెళ్లారు. పేదలపై తనకున్న మమకారాన్ని ఆమె ఎప్పటికప్పుడు చాటుతూ వస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.