యాప్నగరం

మంచం పైనుంచి పడి మరణం.! షాకింగ్

అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి వెళ్లిన వృద్ధుడు ప్రమాదవశాత్తూ చనిపోయాడు. కిందపడి తలకు గాయాలవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 21 Jan 2021, 1:24 pm
అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన వృద్ధుడు అనూహ్యంగా మృతి చెందాడు. చికిత్స పొందుతూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి బెడ్‌ పై నుంచి కిందపడి మృత్యువాత పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో జరిగింది. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకి చెందిన మలమంటి ఇస్రాయేలు(90) అనారోగ్యంతో ఈ నెల 15న ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఆయాసంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bed


అనూహ్యంగా బుధవారం ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆయాసంతో చికిత్స పొందుతున్న ఇస్రాయేలు ప్రమాదవశాత్తూ మంచంపై నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచాడు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఇస్రాయేలు మంచంపై నుంచి పడి చనిపోవడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.