యాప్నగరం

మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత

10 సంవత్సరాలు బూర్గంపాడు నియోజకవర్గ MLA గా పనిచేసినారు. పునర్విభజనకు ముందు రెండు సార్లు ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు.

Samayam Telugu 25 Apr 2021, 11:05 am
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చనిపోయారు. గత కొన్నిరోజుల నుంచి ఆయన బ్రెయిన్ స్టోక్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. కుంజా భిక్షం 1989-99 కాలంలో 10 సంవత్సరాలు బూర్గంపాడు నియోజకవర్గ MLA గా పనిచేసినారు. పునర్విభజనకు ముందు బూర్గంపాడు నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా కుంజా భిక్షం పనిచేశారు.
Samayam Telugu మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం (ఫైల్ ఫోటో)


బూర్గంపాడు ఆసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న సమయంలో సీపీఐ తరపున 1989, 1999 సంవత్సరాల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆశ్వాపురంలోని హెవీవాటర్‌ ప్లాంట్‌లో కార్మికుడిగా పనిచేసే సమయంలో సీపీఐ సిద్ధాంతాలకు ఆకర్షితులైన కుంజా భిక్షం ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున 1989లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా 46,179ఓట్లు సాధించి గెలుపొందారు. అదే విధంగా 1994లో మరోసారి సీపీఐ తరపున పోటీ చేసి 56,946ఓట్లు సాధించి గెలుపొందారు. అనంతరం సీపీఐలో తలెత్తిన విభేదాల వల్ల ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

కుంజా భిక్షం వయసు 65 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు సీపీఐ నేతలు సైతం ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.