యాప్నగరం

పోడు పోరు.. బుల్‌డోజర్లతో పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులు

Khammam: తెలంగాణలోని చాలా ఏజెన్సీ గ్రామాల్లో పోడు పోరు ఆగడం లేదు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అధికారులు, గిరిజనులకు మధ్య నిత్యం పోరు జరుగుతూనే ఉంది. ఒకరు హక్కుల కోసం పిడికిలి ఎత్తుతుండగా.. మరొకరు విధి నిర్వహణ అంటూ పంటల విధ్వంసానికి దిగుతున్నారు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 17 Aug 2022, 2:42 pm

ప్రధానాంశాలు:

  • భద్రాది కొత్తగూడెం జిల్లాలో మరోసారి పోడు పోరు
  • ఉద్రిక్తంగా మారిన కరకగూడెం మండలం రేగళ్ల
  • బుల్‌డోజర్లతో పంటలు ధ్వంసం చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Fighting between the two groups
ఇరు వర్గాల మధ్య తోపులాట
Khammam: ఒకరు పొట్ట నింపుకోవడానికి పోరు చేస్తే.. మరొకరు విధి నిర్వహణ పేరుతో పంటల విధ్వంసానికి దిగుతున్నారు. దీంతో ఏజెన్సీ గ్రామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పోడు భూముల సమస్య ఉన్నా.. వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా ఎందో అమయాకులు జైలు (Jail) పాలవుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా భద్రాది కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పోడు పోరు ఉద్రిక్తంగా మారింది. కరకగూడెం మండలం రేగళ్ల పంచాయతీలోని మర్రి మొదలు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోడు సాగుదార్లకు, అటవీశాఖ అధికారులకు మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూముల్లో గిరిజన రైతులు వేసుకున్న పంటలను ఫారెస్ట్ అధికారులు (Forest Officers) బుల్‌డోజర్లతో ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

అటవీశాఖ అధికారులను అడ్డుకున్న ఆరుగురు గిరిజనులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రేగళ్ల రేంజ్ కార్యాలయానికి తరలించారు. భద్రాద్రి (Bhadradri) ఏజెన్సీలో పోడు పోరు నిత్యకృత్యంగా మారింది. ఈ ఇష్యూపై ప్రభుత్వం ఫోకస్ పెట్టి.. అటవీశాఖ అధికారులు తమ వద్దకు రాకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు. వీలైనంత త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.